షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ కు మదర్ తెరెసా అంతర్జాతీయ అవార్డు

- November 21, 2016 , by Maagulf
షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ కు  మదర్ తెరెసా అంతర్జాతీయ అవార్డు

యుఏఈ విదేశీ వ్యవహారాల మరియు అంతర్జాతీయ సహకారం మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు  ప్రతిష్టాత్మక మదర్ తెరెసా అంతర్జాతీయ అవార్డు లభించింది.ఈ గౌరవంను  ఆయనకు  ముంబై ఆధారిత హార్మొనీ ఫౌండేషన్ ఒక ధార్మిక సంస్థ అందచేయనుంది. వ్యక్తులను శాంతి మరియు సామరస్యధోరణీ  వైపు పయనింపచేయడం ఆయన చేసిన కృషి ఒక అసాధారణ తీరని ప్రశంసించింది.తీవ్రవాద గ్రూపులు మరియు అమాయక ప్రజలను  హింస మార్గం వైపు ప్రేరింపచేసి  ప్రచారం చూస్తున్న వ్యక్తులు నుండి మరియు విప్లవభావ నూరిపోస్తున్న సంస్థలు నుండి యువతను రక్షించే ప్రణాలికను రూపొందించడంలో ఆయన నిర్మాణితమైన పనికి షేక్ అబ్దుల్లా సన్మానించడంకు అర్హుడవుతారు. అబ్దుల్ రెహమాన్ మొహమ్మద్ అల్ ఒవైస్, ఆరోగ్యం మరియు నివారణ మంత్రి ముంబై లో ఆదివారం తన తరపున ఆ అవార్డు అందుకుంటారని  ఈ విషయాన్ని  డాక్టర్ అబ్రహం మతాయి, హార్మొనీ ఫౌండేషన్ అధ్యక్షుడు చెప్పారు. మతాయి మాట్లాడుతూ, షేక్ అబ్దుల్లా తన అసాధారణ కార్యదీక్షతో "మధ్యప్రాచ్యంలో శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రచారం బ్రహ్మాండంగా నిర్వహించారని అందుకే ఆయన  అవార్డుకు ఒక  స్పష్టమైన ఎంపిక అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com