ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు
- November 24, 2016మనామా: హై క్రిమినల్ కోర్ట్, ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారనీ, వాటిని వినియోగించారనే అభియోగాలు వారిపై మోపబడ్డాయి. మమీర్లో ఓ పోలీస్ అధికారిని చంపేందుకు కూడా ఈ వ్యక్తులు కుట్ర పన్నిన కేసులో దోషులుగా తేలారని చీఫ్ ప్రాజిక్యూటర్ హమాద్ షహీన్ చెప్పారు. 2015 మే 30న మమీర్ విలేజ్లో బాంబుల్ని పెట్టి ఓ పోలీస్ అధికారిని చంపడానికి ప్లాన్ చేశారు. అనుమానాస్పదంగా అక్కడే నక్కి ఉన్నవారిని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బాంబుని కనుగొని నిర్వీర్యం చేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. బాంబు ఒకవేళ పేలి ఉంటే తీవ్రమైన నష్టం వాటిల్లేది. అన్ని వాదనల్నీ విన్న న్యాయస్థానం, సాక్ష్యాధారాల్ని పరిశీలించి, నిందితులకు జీవిత ఖైదును విధించింది. నిందితుల తరఫున కూడా వాదనలకు ఆస్కారం కలిగిందిగానీ, నేర నిరూపణ అవడంతో నిందితులకు శిక్ష తప్పలేదు.
తాజా వార్తలు
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు