డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు..
- December 22, 2016తన దత్తత గ్రామాలైన సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పేదలకు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఉదయం ఎర్రవల్లి చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్ను ఆవిష్కరించారు. సామాజిక భవనాన్ని ప్రారంభించి.. అక్కడ నిర్వహించిన వాస్తు హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
గతేడాది విజయదశమి రోజు ముఖ్యమంత్రి ఈ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఆయన ప్రత్యేక దృష్టి సారించడంతో కేవలం 14 నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అన్ని హంగులతో సకల సౌకర్యాలతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రవల్లిలో 330, నర్సన్నపేటలో 159 ఇళ్లల్లో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ