ప్రధాని సంతాపం...

- January 22, 2017 , by Maagulf
ప్రధాని సంతాపం...

న్యూదిల్లీ: విజయనగరం జిల్లాలో శనివారం అర్థరాత్రి జరిగిన రైలు ప్రమాద మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌ వద్ద హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం రాత్రి పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 32మందికి పైగా మృతిచెందారు. దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ.. ఇది విషాదకర ఘటన అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా సంతాపం ప్రకటించారు. ‘ఈ ఘటన చాలా విచారకరం.. బాధాకరం.. విలువైన ప్రాణాలను కోల్పోయాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com