డ్రైవర్ల కోసం ఆర్టిఎ - స్మార్ట్ యార్డ్స్
- March 07, 2017రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), కొత్తగా స్మార్ట్ యార్డ్ని డ్రైవర్ల పరీక్ష కోసం ఏర్పాటు చేసింది. లైట్ డ్రైవర్ లైసెన్స్ అప్లికెంట్స్ కోసం దుబాయ్ డ్రైవింగ్ సెంటర్, అల్ ఖయిల్ బ్రాంచ్, అల్ కోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేశారు. మాన్యువల్ గేర్తో కూడిన వాహనానికి కొత్త టెక్నాలజీని జోడించి ఇక్కడ డ్రైవర్లకు పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. దుబాయ్ని స్మార్టెస్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నారు. అందులో ఈ స్మార్ట్ డ్రైవర్ టెస్ట్ టెక్నాలజీ కూడా ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా విధానం ఇదే ప్రథమం. పరీక్ష కోసం ఉపయోగించే కారుతోపాటు, యార్డ్కీ అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. వాటి ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో పరీక్షను నిర్వహించడానికి వీలవుతుంది. ఒకేసారి పలు వాహనాల ద్వారా డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా టవర్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా అత్యంత ఖచ్చితంగా పాస్ అయినవారిని ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ