లక్నోలో ఉగ్రవాదులు కలకలం
- March 07, 2017లక్నోలోని ఠాకూర్గంజ్లో ఉగ్రవాదులు కలకలం రేపారు. ఓ ఇంట్లో చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద భారీ ఆయుధాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఉగ్రవాదుల్లో ఒకరిని సైఫుల్లాగా పోలీసులు గుర్తించారు. ఓవైపు పోలీస్ ఆపరేషన్ జరుగుతుండగా, మరోవైపు యూపీ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సమీక్ష జరుపుతోంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ