పసిడి విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

- March 30, 2017 , by Maagulf
పసిడి విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

బంగారం విక్రయాలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ అవసరాల కోసం మీ వద్ద ఉన్న బంగారాన్ని అత్యవసరంగా విక్రయించాలనుకుంటున్నారా ... ఆగండి... ఆగండి ఏప్రిల్ 1వ తేదీ తర్వాత బంగారం విక్రయిస్తే మీకు కేవలం పదివేల రూపాయల నగదే ఇస్తారట. మిగతా మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాలో వేస్తారట. అత్యవసరం దృష్ట్యా వైద్యం కోసం లేదా ఇతర కుటుంబ ఖర్చుల కోసం డబ్బు కావాలని బంగారం విక్రయిస్తే బ్యాంకు ఇచ్చే దాకా వేచి ఉండాల్సిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో సవరణలు తీసుకురానుంది. ఈ కొత్త నిబంధన వల్ల బంగారం వ్యాపారం దెబ్బ తినే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com