రమదాన్ సందర్భంగా ఖతర్‌ రాజు క్షమాభిక్ష

- June 23, 2017 , by Maagulf
రమదాన్ సందర్భంగా ఖతర్‌ రాజు క్షమాభిక్ష

ఖతర్‌:పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని భారత్‌కు ఖతర్ తీపికబురు చెప్పింది. తమ దేశ జైల్లో మగ్గుతున్న 42 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించింది. ఈ మేరకు ఖతర్‌ రాజు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ ఉత్తర్వులు జారీచేసినట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే భారతీయ ఖైదీల్లో ఎవరెవరు విడుదలయ్యారనేది తెలియరాలేదు. ఇటీవల సౌదీ సహా కొన్ని గల్ఫ్ దేశాలు ఖతర్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఖతర్‌తో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించి, విమాన రాకపోకలను కూడా నిలిపివేశాయి. దీంతో ఆ దేశంలోని భారతీయులు కొంత ఇబ్బంది పడ్డారు. అంతర్జాతియంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రంజాన్ సందర్భంగా భారీ సంఖ్యలో భారతీయులకు క్షమాభిక్ష ప్రకటించడం విశేషం. వీరిలో చాలామంది యజమానుల అక్రమ కేసుల్లో బాధితులు కాగా, మరికొంతమంది నేర చరిత్ర కలిగిన వారని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com