పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం ట్యాంకర్కు నిప్పంటుకుని 120 మంది సజీవ దహనం
- June 25, 2017పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అహ్మద్ పూర్ షర్కియా వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. అయితే ట్యాంకర్ నుండి కిందపోతున్న ఆయిల్ ను స్థానికులు పెద్ద ఎత్తున తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
ప్రమాదవశాత్తు ట్యాంకర్ నుండి ఆయిల్ ను తీసుకెళ్తుండగా అగ్ని ప్రమాదం వాటిల్లింది.దీంతో 120 మది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అయితే ఆయిల్ ట్యాంకర్ సమీపంలో సిగరెట్ తాగడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కూడ 70 శాతం కంటే ఎక్కువగా కాలిపోయారని స్థానికులు చెప్పారు. మృతులను డిఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్