అరబ్ దేశాల డిమాండ్లు సహేతుకంగా లేవు
- June 25, 2017- అరబ్ దేశాల డిమాండ్లపై
ఖతార్ విదేశాంగ మంత్రి అల్ థానీ
- ఇది మా స్వతంత్య్ర విదేశాంగవిధానం, సార్వభౌమత్వంపై దాడి
- అయినప్పటికీ వాటిపై సమీక్ష జరుపుతున్నామని ప్రకటన
దోహా : సోదర అరబ్ దేశాల డిమాండ్లను ఖతా ర్ తోసిపుచ్చింది. తమ దేశంపై ఆంక్షల్ని ఎత్తివే యటం కోసం అరబ్ దేశాలు పెట్టిన 13 నిబంధనలు సహేతుకంగా లేవని ఖతార్ విదేశాంగ మంత్రి అబ్దు ల్ రహమాన్ అల్ థానీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తున్న కువైట్ పట్ల ఉన్న గౌరవం దృష్ట్యా, 13డిమాండ్లపై సమీక్ష జరుపుతు న్నామని, త్వరలో అధికారికంగా స్పందిస్తామని అల్ థానీ అన్నారు. ఖతార్పై సౌదీ అరేబియా, ఈజిప్టు, యుఏఈ, బహ్రెయిన్ దేశాలు తీవ్రమైన దౌత్యపర మైన ఆంక్షల్ని విధించిన సంగతి తెలిసిందే. సంక్షో భం సమసిపోవాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆ దేశాలు శుక్రవారం ప్రకటించాయి. అన్ని పక్షాలూ అంగీకరిస్తూ సమస్య పరిష్కారం కోసం సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సంక్షోభ నివారణకు అరబ్ దేశాలు ముందుకు కదలాలని, ఖతార్ తీసుకోదగిన చర్యల్ని డిమాండ్ చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ కొద్దిరోజుల క్రితమే సూచించారు. అరబ్ దేశాల డిమాండ్లు వాస్తవాలకు దగ్గరగా ఉం డాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి కూడా అభిప్రాయ పడ్డారు. అయితే వారు సూచించినట్టుగా అరబ్ దేశాల డిమాండ్లు లేవని అల్ థానీ విమర్శించారు. తమపై ఆంక్షలు విధించటం ద్వారా తీవ్రవాదాన్ని దెబ్బకొట్టలేరని, తమ దేశ సార్వభౌమత్వంపై, స్వతం త్ర విదేశాంగ విధానంపై దాడి జరుపుతున్నారని 'అల్ జజీరా' మీడియాతో అల్ థానీ చెప్పారు. ఖతార్ పై అరబ్ దేశాలు ప్రకటించిన ఆంక్షలు అమల్లోకి వచ్చి రెండువారాలు దాటింది. రోడ్డు, విమాన సర్వీసుల్ని సౌదీ అరేబియా పూర్తిగా నిలిపివేసింది. అలాగే సోదర అరబ్ దేశాల నుంచి కూడా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకున్నారు. దోహా కేంద్రంగా ఖతార్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన 'అల్ జజీరా' టీవీ ప్రసారాల్ని వెంటనే నిలిపివేయాలని కూడా అరబ్ దేశాలు డిమాండ్ చేశాయి. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఖతార్ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు లోనైంది.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..