ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్లో యూఏఈ రూలర్స్
- June 25, 2017యూఏఈ:యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని ఆదివారం జబీల్ మాస్క్ వద్ద నిర్వహించారు. షేక్ మొహమ్మద్తో కలిసి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ప్రార్థనలు నిర్వహించారు. వెల్ విషర్స్ నుంచి షేక్ మొహమ్మద్ రంజాన్ శుభాకాంక్షల్ని అందుకున్నారు. జబెల్ మాస్క్ వద్ద పలువురు షేక్ మొహమ్మద్కి రంజాన్ శుభాకాంక్షలు తెలపడంతోపాటుగా, సమర్థ నాయకత్వంలో యూఏఈ మరింత ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అక్కడికి వచ్చినవారందరికీ ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. షేక్ జాయెద్ మాస్క్లో మొహమ్మద్ బిన్ జాయెద్ - ఈద్ అల్ ఫితర్ ప్రేయర్ నిర్వహించారు. పలువురు ప్రముఖులు, అధికారులు, పౌరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA