సౌదీ అరేబియాలో ముగిసిన క్షమాభిక్ష గడువు

- June 25, 2017 , by Maagulf
సౌదీ అరేబియాలో ముగిసిన క్షమాభిక్ష గడువు

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్ష గడువు నిన్నటితో ముగిసింది. ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. తెలంగాణకు చెందిన మూడు వేల మంది క్షమా భిక్షకు దరఖాస్తు చేసుకోగా ..మరో మూడు వేల మంది అక్కడే తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారు అక్కడ ఉండలేరు..ఇండియాకు రాలేరు. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నవారిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారు.రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష సౌదీ రియాల్స్ జరిమానా విధించే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోని తెలంగాణ కార్మికులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ఆశ్రయం ఇచ్చేవారే కరువయ్యారు. సౌదీలో వేతనాలు ఎక్కువగా ఉంటాయన్న భావనతో తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉపాధి వెతుక్కుంటూ సౌదీ వెళుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com