దక్షిణాఫ్రికా లోని మనుషుల్ని తిని అలసిపోయిన నరమాంస భక్షకుడు
- August 23, 2017మనిషి ని మనిషి చంపుకొని తినే స్థాయి నుంచి మానవుడు నాగరికత నేర్చాడు.. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల నర మాంస భక్షకులు ఉన్నారనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి.. తాజాగా ఓ నరమాంస భక్షకుడు తాను మనుషుల్ని తిని తిని అలసిపోయాను.. ఇక మనుషులను తినలేను అని పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. తాను లొంగిపోతూ.. పోలీసులకు ఓ మనిషి కాలు, చేతిని కూడా అప్పగించి వారికి షాక్ ఇచ్చాడు.. వివరాల్లోకి వెళ్తే..
దక్షిణాఫ్రికా లోని అమాంగ్వే ప్రాంతంలో గత కొంత కాలంగా పలువురు కనిపించకుండా పోతున్నారు. దీంతో చాలా మంది తమ వాళ్ళు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపద్యంలో పోలీసులు విచారణ చేపట్టగా ఓ ప్లేస్ లో కుండ దానినిండా మానవ అవయవాలు లభ్యమయ్యాయి. అంతేకాదు.. ఇటీవల ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు కలిసి దారుణంగా చంపేసి.. ఆమె మృత దేహాన్ని ముక్కలుగా నరికేశారు. ఆపై.. ఆమె మృతదేహంలోని అవయవాలను ఆ ముగ్గురు వ్యక్తులు తినేశారు.. ఈ విషయం పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.. కాగా ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తాను మనుషులను తిని అలసిపోయాను అని స్వయంగా పోలీసులకు లొంగిపోవడం తో అతనిని అదుపులోకి తీసుకొన్నారు.. మిగిన ఇద్దరు నర మాంస భక్షకుల కోసం వెదుకుతున్నారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్