గురువారం ప్రారంభించనున్న మసాక్-షినాస్-ఖాసబ్ సేవలు
- August 23, 2017ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ 'మ్వాసలాట్' గురువారం నుంచి మస్కట్ -షినాస్-ఖాసబ్ మార్గాన్ని ప్రారంభిస్తుంది. ఇది సుల్తానెట్ లో భూమి మరియు సముద్రాన్ని కలిపే మొట్టమొదటి మార్గం. సుల్తానాట్లో రవాణా, నిర్మాణరంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును మొదలుపెడుతున్నారు. ఆగష్టు 24 వ తేదీ నుండి ఆగస్టు 31 వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి ఓ ఏకైక అనుభూతి కోసం ఈ కొత్త మస్కట్-ఖాసబ్ మార్గం మరియు ఖాసబ్-మస్కాట్ మార్గంలో ప్రయాణీకులు పరిమిత సీట్లకు ఈ సేవ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం బస్సు మరియు ఫెర్రీలను మొదటిసారిగా వినియోగించనున్నారు. ముసణ్డం గవర్నరేట్ పరిధిలో ఉద్యోగులు మరియు నివాసితులు కోసం ప్రత్యేక ధరలు మరియు 3-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 50 శాతం రాయితీని కల్పించనున్నారు. అలాగే మూడేళ్ళ వయస్సు గల పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. అల్ అజాబా, అల్ సహబ్ టవర్, అల్ మబాలియా మరియు సోహార్లలోని మెజాసలత్ కార్యాలయాల్లో ఆయా శాఖలలో టికెట్లు లభ్యం కానున్నాయి. మరియు కాల్ సెంటర్ లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. సీట్లు పరిమితమైనందున ముందస్తు టికెట్ల బుకింగ్ 24 గంటల ముందు ప్రయాణానికి చేసుకోవాలని ఈ సందర్బముగా సిఫార్సు చేయబడింది.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష
- దుబాయ్ వ్యక్తి రెస్క్యూ మిషన్: గర్భిణీ నర్సు, వృద్ధ జంట, పర్యాటకులు సేఫ్
- ఖతార్-ఇండియా మధ్య స్థిరమైన వాణిజ్య వృద్ధి..భారత రాయబారి
- క్లౌడ్-సీడింగ్ పుకార్లను ఖండించిన యూఏఈ