మేథీ, కార్న్ పులావ్
- October 04, 2017కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ - 2 కప్పులు, స్వీట్కార్న్- ఒక కప్పు, మెంతికూర- మూడు కట్టలు, టమాటాలు- రెండు, ఉల్లి పాయ- 1, పచ్చిమిర్చి- 2, కొత్తిమీర- ఒక కట్ట, ఉప్పు - తగినంత, పసుపు- చిటికెడు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరంమసాలా పొడి, లవం గాలు, చెక్క, షాజీర
తయారీ విధానం: బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో నూనె వేడిచేసి చెక్క, లవంగాలు, షాజీర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు నిలువుగా తరిగిన ఉల్లి, మిర్చి వేసి వేయించి టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు మెత్తగా ఉడి కిన తరువాత పసుపు, కారం, ఒక టేబుల్ స్పూన అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, తరి గిన మెంతికూర, స్వీట్కార్న్, ఒక టేబుల్ స్పూన గరం మసాలా పొడి వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలు వేయించి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేయాలి. నీరు మరిగినప్పుడు బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి అంతా పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ