ఫిర్ని

- October 06, 2017 , by Maagulf
ఫిర్ని

కావలసిన పదార్థాలు
 
బాస్మతి బియ్యం- 2 టేబుల్‌ స్పూన్లు, పాలు- 3 కప్పులు, చక్కెర- 5 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి- అర టీ స్పూను, బాదం పొడి- ఒక టేబుల్‌ స్పూను, జీడిపప్పు, బాదం- అలంకరణకు.
 
తయారీ విధానం
 
బాస్మతి బియ్యాన్ని గంటసేపు నానబెట్టి, ఒక కప్పు పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. మిగిలిన పాలను గిన్నెలో పోసి వేడి చేసి, మరుగుతున్నప్పుడు బాస్మతి మిశ్రమం వేసి ఉడికించాలి. చక్కెర, యాలకుల పొడి కూడా వేసి, గరిటెతో కలుపుతూ గట్టిపడేదాకా ఉడికించాలి. పైన బాదం, జీడిపప్పులతో అలంకరించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com