పుణెలో రేపట్నుంచి భారత్‌-శ్రీలంక సైనిక విన్యాసాలు ప్రారంభం

- October 12, 2017 , by Maagulf
పుణెలో రేపట్నుంచి భారత్‌-శ్రీలంక సైనిక విన్యాసాలు ప్రారంభం

భారత్‌, శ్రీలంక సైనిక విన్యాసాలు రేపట్నుంచి పుణెలో ప్రారంభం కానున్నాయి. దేశీయంగా ఉగ్రవాద దాడులను సమర్ధంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇరుదేశాల సైనికులు ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. మిత్రశక్తి ఐదో ఎడిషన్‌ సైనిక విన్యాసాలు 13 రోజులపాటు జరగనున్నాయి. నాల్గో విడత సైనిక విన్యాసాలు గతేడాది శ్రీలంకలో జరిగాయి. రెండు దేశాల మధ్య రక్షణ రంగాల్లో సహకారమే లక్ష్యంగా 2013 నుంచి భారత్‌, శ్రీలంకలు సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com