ఒక కారు కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్న నిర్వాసితులపై నిషేధ ప్రతిపాధన
- October 12, 2017కువైట్ : జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాహనాల సంఖ్య మరియు దేశం యొక్క రహదారుల సామర్ధ్యంపై ఒక అధ్యయనం పూర్తి చేసింది. దేశంలోని బెడోన్ నివాసితులపై విధించిన నిషేధం మాదిరిగానే జీసీసీ జాతీయులు, అరబ్బులు మరియు ఇతర విదేశీయులకు ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్నవారిని దేశం నుండి నిషేధించాలని ఈ అధ్యయనం సిఫార్సు చేసింది. ఈ అధ్యయనం ప్రకారం 1.2 మిల్లియన్ వాహనాలను మాత్రమే రోడ్లపై తిరిగే సామర్ధ్యం కలిగి ఉంటె , అందుకు మించి 1.9 మిలియన్ల వాహనాలు దేశంలోని రహదారులపై తిరుగుతూ పలు రోడ్లపై తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఆ అధ్యయనం ప్రకారం దేశీయ కార్ల నమోదు ప్రక్రియలో భాగంగా ప్రవాసీయులకు అదనపు వాహనాలను నియంత్రణ చేయాలని సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ చర్యలు కనుక తీసుకొంటే ప్రస్తుతం అమలు చేయబడుతున్న రహదారుల ప్రాజెక్టులలోని వివిధ రహదారులపై ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!