దుబాయ్ పాఠశాలలో అగ్నిప్రమాదం : 2,200 మంది విద్యార్థులను క్షేమంగా ఖాళీ చేయించారు
- October 12, 2017దుబాయ్: దుబాయ్ లోని ఘర్హౌడ్ ప్రాంతంలోని అల్ ఖలీజ్ నేషనల్ స్కూల్లో ఒక ప్రాథమిక కళా తరగతి గదిలో గురువారం ( నేడు ) ఉదయం 11.50 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పాఠశాలలో ఉన్న 2,200 మంది విద్యార్థులను ఖాళీ చేయించారు.. దుబాయ్ సివిల్ డిఫెన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు ఐదు నిమిషాల వ్యవధిలో పాఠశాలకు చేరుకున్నాయి. అగ్నిమాపక నియంత్రణ జట్టు ఎగిసిపడుతున్న మంటలను మధ్యాహ్నం 12.20 గంటలకు ఆర్పివేయగలిగేరు. అధికారులు మరియు ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం , మొట్టమొదటి అంతస్తులో పైకప్పుకు సమీపంలో ఉన్న ఒక ఎయిర్ కండిషన్డ్ నుండి పొగను గమనించామని వారు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. , దుబాయ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ పరిస్థితిని నియంత్రించిందని, విద్యార్థులు మరియు టీచింగ్ అధ్యాపకులు వెంటనే ఆవరణ నుండి ఖాళీ చేయించారు మరియు వారివరకు ఎటువంటి గాయాలూ లేవని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్