నవంబర్ 2న ప్రారంభం కానున్న వెంకీ కొత్త చిత్రం.!

- October 19, 2017 , by Maagulf
నవంబర్ 2న ప్రారంభం కానున్న వెంకీ కొత్త చిత్రం.!

ఈ ఏడాది మొదట్లో గురు సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్..ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమాను ఎంత వరకు సెట్స్ పైకి తీసుకురాలేదు. మధ్య లో చాల కథలే విన్న కానీ అవేవి వెంకీ కి పెద్దగా నచ్చక పోవడం తో తదుపరి సినిమాకు చాల గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల నేనే రాజు నేనే మంత్రి సినిమా తో మళ్లీ సక్సెస్ అందుకున్న తేజ , ఈ మధ్యనే వెంకీ కి ఓ కథ వినిపించాడట. అది వెంకీ కి బాగా నచ్చడం తో వెంకటేనే తేజ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
 
ఈ మూవీ ని నవంబర్ 2 నుండి సెట్స్ పైకి తీసుకరావాలని వెంకటేష్ భావిస్తున్నాడట. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అనిల్ సుంకరలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నారట. ఇక ఈ మూవీ కి సంబదించిన నటి నటుల వివరాలు , మిగతా క్రూ గురించి అతి త్వరలోనే తెలియజేస్తారట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com