సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఉన్నది ఒకటే జిందగీ'

- October 20, 2017 , by Maagulf
సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఉన్నది ఒకటే జిందగీ'

ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా 'నేను శైలజ' దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్‌ని సొంతం చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 27న విడుదల కానుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యు ఇవ్వడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఫ్యామిలీ మొత్తం ఓ మంచి చిత్రం చూశామనే ఫీలింగ్‌ని ఈ చిత్రం ఇస్తుందని, సెన్సార్ సభ్యులు కూడా ఇదే అన్నారని చిత్రయూనిట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com