దహీ కె కబాబ్
- October 20, 2017కావల్సినవి: గడ్డ పెరుగు - ఒకటిన్నర కప్పు, కొత్తిమీర కట్ట - ఒకటి, ధనియాలు - అరచెంచా, సెనగపిండి - టేబుల్స్పూను, మ్యుసెలీ లేదా కార్న్ఫ్లేక్స్ - పావుకప్పు, జీలకర్రపొడి - అరచెంచా, యాలకులపొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, వెనిగర్ - చెంచా, చిక్కని పెరుగు - అరకప్పు, మిరియాలపొడి - కొద్దిగా.
తయారీ: పెరుగును ఓ గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాలపొడీ, సెనగపిండీ, జీలకర్రపొడీ, వెనిగర్, కొత్తిమీర తరుగూ, యాలకులపొడీ, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న పట్టీల్లా చేసుకుని తరవాత మ్యూసెలీ లేదా కార్న్ఫ్లేక్స్లో అద్దాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. దీన్ని ఉల్లిపాయముక్కలు, మిరియాలపొడీ, ఉప్పు వేసిన పెరుగుతో కలిపి వడ్డించాలి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ