రెండు జన్మల కథతో పూరి తనయుడు నటిస్తున్న 'మెహబూబా'

- October 21, 2017 , by Maagulf
రెండు జన్మల కథతో పూరి తనయుడు నటిస్తున్న 'మెహబూబా'

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. భారత్ పాక్ యుద్ధం కాలంలో చనిపోయిన ప్రేమ జంట తిరిగి ఈ కాలంలో పుట్టటం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నారు. పూరి తన సొంత బ్యానర్ లో మెహబూబా సినిమాను నిర్మిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com