అమరవీరుల కుటుంబాలకు అక్షయ్ కుమార్ కానుక దీపావళి.!
- October 21, 2017అమరవీరులైన సైనికుల కుటుంబాలను ఆదుకోవడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఎప్పుడూ ముందుంటారు. వాళ్ల కుటుంబాలకు వీలైన సహాయం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ రేంజ్కు చెందిన దాదాపు 103 అమరవీరుల కుటుంబాల్లో ఆయన ఆనందం నింపారు. వారి కోసం చెక్కు పంపిస్తూ.. మనసుకు హత్తుకునే విధంగా ఓ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసులు, పారామిలటరీ బలగాలు, సైనికుల సమాచారాన్ని కొల్హాపూర్ అధికారులతో కలిసి సేకరించారు.
దాదాపు 103 మంది అమరవీరుల కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.25వేల చెక్కును పంపించారు. దాంతో పాటు ఓ లేఖను, చిన్నారుల కోసం పుస్తకాలు, స్వీట్లు పంపించారు. 'దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న సిబ్బంది కుటుంబసభ్యులైన మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ దీపావళి పండుగ నాడు మీ ప్రియమైన వారితో గడపలేకపోతున్నారని నాకు తెలుసు. కానీ మీరు ధైర్యంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. మీ కోసం మిఠాయిలు, చిన్నారుల కోసం పుస్తకాలు పంపిస్తున్నా. ప్రేమతో అంగీకరించండి' అని లేఖను కూడా అక్కీ పంపారు.
తాజా వార్తలు
- యూట్యూబ్ భారీ షాక్.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు..
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు