జఫ్రన్ షర్బత్
- October 24, 2017కావలసిన పదార్థాలు : పాలు - 1లీటరు, కుంకుమపువ్వు - 12 కాడలు (2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టాలి), పంచదార - 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - పావు టీ స్పూను, రాత్రి నానబెట్టిన బాదం పప్పులు - 12, పిస్తా - 8, జీరాపొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న పాత్రలో పాలు, కుంకుమపువ్వు వేసి సన్నని మంటపై 10 నిమిషాలు వేడి చేయాలి. పంచదార, యాలకులపొడి కూడా వేసి మరో 5 నిమిషాలు వేడిచేసి దించేయాలి. సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకుల్ని వేసి బాగా కలపాలి. గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక ఫ్రిజ్లో ఉంచి బాగా చల్లబడ్డాక తీసి గ్లాసుల్లోకి నింపి పైన జీరా పొడి చల్లాలి. ఈ షర్బత్ వేసవి తాపాన్ని తీర్చే ఔషధంలా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు