భారత్ లో పాగాకు ఐసిస్ యత్నం, గల్ఫ్ నుంచి భారీగా నిధులు

- November 17, 2017 , by Maagulf
భారత్ లో పాగాకు ఐసిస్ యత్నం, గల్ఫ్ నుంచి భారీగా నిధులు

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో క్రమంగా ప్రాబల్యం తగ్గిపోవడంతో... ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కన్ను మన దేశంపై పడింది. ప్రపంచంలోని పలు దేశాల్లో నెత్తుటి ఏర్లు పారించిన ఐసిస్... ఇప్పుడు భారత్ లో పాగా వేసేందుకు యత్నిస్తోంది.
ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థ మనదేశంలోని కేరళను టార్గెట్ చేస్తోంది. కేరళ నుంచి వెళ్లి ఐసిస్ లో చేరుతున్నవారికి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తూ.. భారత్ లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తోంది.
ఈ క్రమంలో భారత్ కు నిధులను తరలించేందుకు ఈ ఉగ్రవాద సంస్థ హవాలా మార్గాలను ఎంచుకుంది. అయితే భారత్ లో భారీ విధ్వంసానికి ఐసిస్ నిధులను సమకూరుస్తోందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు.. ఐసిస్ ప్రణాళికలను భగ్నం చేశారు.
ఐసిస్ సానుభూతిపరులపై మెరుపుదాడులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గల్ఫ్ దేశాల నుంచి హవాలా రూపంలో తస్లీం అనే వ్యక్తికి డబ్బు వస్తోందని, అతడి వద్ద నుంచి ఐసిస్ సానుభూతిపరులకు పంపిణీ అవుతోందని పోలీసులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com