కోటి మార్క్‌ను కొట్టేసిన ఎయిర్‌ ఇండియా

- November 17, 2017 , by Maagulf
కోటి మార్క్‌ను కొట్టేసిన ఎయిర్‌ ఇండియా

ముంబయి : మొట్ట మొదటి సారి విమాన ప్రయాణికుల సంఖ్య కోటి మార్క్‌ను చేరింది. ఈ ఏడాది అక్టోబర్‌లో 10.45 మిలియన్లుగా నమోదయ్యిందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) శుక్రవారం వెల్లడించింది. గతేడాది ఇదే మాసం ప్రయాణికులతో పోల్చితే ఏకంగా 20.52 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ ఇండియా 80 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకుందని తెలిపింది. బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో ఏకంగా 41.33 లక్షల ప్రయాణికులను చేరవేసింది. రెండో స్థానంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 15.88 లక్షల ప్యాసింజర్లను గమ్యానికి చేర్చింది. కాగా తర్వాత స్థానాల్లో ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌, ఎయిర్‌ ఆసియా ఇండియా సంస్థలు అధిక మంది ప్రయాణికులను చేర్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com