హైదరాబాద్లో ఇవాంకా..గ్రాండ్ వెల్కమ్
- November 27, 2017అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్హౌస్ సలహాదారు ఇవాంకా హైదరాబాద్కి చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్న ఆమెకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్కు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో భేటీకానున్నారు.
అలాగే ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం హెచ్ఐసీసీ వేదిక వద్దకు చేరుకుంటారు.
అక్కడ మోదీని ఇవాంక మర్యాదపూర్వకంగా కలుస్తారు. పారిశ్రామికవేత్తల సదస్సు తర్వాత ఇద్దరూ కలిసి ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటారు. విందు అనంతరం రాత్రి 10.45 గంటలకు ఇవాంకా తిరిగి ట్రైడెంట్ హోటల్కు చేరుకుంటారు. ఇవాంకా రాక సందర్భంగా హైటెక్ సిటీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA