హెయిల్ కు చేరుకొన్న మొదటి సౌదీ రైల్వే కంపెనీ రైలు

- November 29, 2017 , by Maagulf
హెయిల్ కు చేరుకొన్న మొదటి సౌదీ రైల్వే కంపెనీ రైలు

జెడ్డా: మొదటి సౌదీ రైల్వే కంపెనీ రైలు శనివారం హెయిల్ లో ప్రవేశించింది. అల్-మజ్మాహ్ మరియు ఖాసీమ్ గుండా ప్రయాణించిన ఈ రైలు రియాద్ నుండి నాలుగవ స్టాప్ గా హెయిల్  ఉంది. అర్ధ జానపద నృత్యాన్ని సంతోషంగా చేయడం ద్వారా ఈ రైలును స్థానికులు ఘనంగా స్వాగతించారు. ఈ రైలు సేవతో రాజధాని రియాద్ కు కలుపబడే ఒక సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఎంపికను హెయిల్ నివాసులను అందిస్తుంది. సౌదీ అరేబియా రైల్వే సేవ ,నిర్వహణ స్థానాల్లో ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. రియాద్ నుండి హేయిల్ వరకు ప్రయాణం చేయటానికి  ప్రారంభ టికెట్ 120 సౌదీ రియల్ (32 డాలర్లు) ధరలు ఉంటాయి,అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లయితే ప్రయాణికుడు 60 సౌదీ రియళ్ల రాయితీని పొందవచ్చు. ప్రయాణికులు ఆదివారాలు, బుధవారాలు ,శుక్రవారాలలో రియాద్-హేల్ రైలులో ప్రయాణించవచ్చు .ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన పలువురు వివిధ సోషల్ మీడియా వేదికలపై సౌదీ రైల్వే కంపెనీ రైలు గూర్చి సానుకూలంగా స్పందిస్తూ, సొగసైన కాబిన్ డిజైన్ , మృదువైన నిర్వహణ పట్ల  ప్రశంసించారు. రెడ హన్వార్ అనే మహిళ  రైలులో తన అనుభవాన్ని ఒక ట్వీట్లో పేర్కొంటూ, " తాను ఒక కలలోకి అడుగుపెట్టిన అనుభూతి ఉందని ఈ ప్రయాణినికి అంతమే లేదని భవిష్యత్తు మహా అనంతమైనదని  ఆమె పేర్కొంది. "

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com