అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
- December 06, 2017పై చదువుల కోసం ఎంతో సంతోషంతో అమెరికాకు వెళ్లిన ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. కుత్భుల్లాపూర్ సూరారంకు చెందిన నాగ తులసీరామ్(26) మంగళవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తులసీరామ్ను ఓ మహిళ కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో తులసీరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రిడ్జిపోర్టు యూనివర్సిటీలో నాగ తులసీరామ్ ఎంఎస్ చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. పిల్లల చిన్నతనంలోనే నాగ తులసీరామ్ తల్లి మృతిచెందింది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA