21న కాకినాడలో ఎ.ఆర్.రెహమాన్ లైవ్ కాన్సర్ట్
- December 17, 2017ఆంధ్రప్రదేశ్ టూరిజానికి కొత్త పాలసీ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. పర్యాటకలను ఆకర్షించేలా జాతీయ స్థాయి ఈవెంట్లను ప్లాన్ చేస్తోంది. కొద్ది రోజుల కిందట సోషల్ మీడియా అవార్డుల వేడుకను నిర్వహించిన టూరిజం శాఖ.. ఈ నెలలో కాకినాడలో రెహమాన్ కాన్సర్ట్ను ఏర్పాటు చేసింది. టూరిజంలో ఆంధ్రప్రదేశ్కు అందిపుచ్చుకున్నన్ని అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం... ఆ దిశగా పకడ్బందీగా ప్రణాళికలు వేసుకుంటోంది. కొత్త టూరిజం పాలసీతో పెట్టుబడిదార్లను ఆకర్షించేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీని టూరిజం శాఖ సిద్దం చేసింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
దేశవిదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈవెంట్లను నిర్వహించేందుకు టూరిజం శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. కొద్ది రోజుల క్రితం అమరావతిలో సోషల్ మీడియా అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించింది. దీపికా పదకొనేలాంటి సూపర్ స్టార్తో పాటు అనేక మంది సినీతారలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. సోషల్ మీడియా అవార్డులనే కాన్సెప్టే కొత్తది కావడం... దీపికా పదకొనే రావడంతో ఈ కార్యక్రమం దేశం దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ... విశాఖ ఉత్సవ్ లాంటి వాటిని నిర్వహించారు. ఈ కోవలో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ ను కాకినాడలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. ఈ ఈవెంట్ను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. పైగా ప్రజలందరూ ఉచితంగా ఈ కాన్సర్ట్ను ఆస్వాదించే ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించి... టూరిజం శాఖ నిర్వహించే ఈవెంట్లను ఓ బ్రాండ్ తెచ్చేలా ప్రయత్నాలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్