వెబ్ సైట్ లకు గూగుల్ హెచ్చరిక.!
- December 17, 2017ఇటీవల కాలంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న అసత్య వార్తలకు(ఫేక్ న్యూస్) అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ చర్యలు ప్రారంభించింది. నెటిజన్లను తప్పుదోవ పట్టించే అలాంటి వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. ఫేక్ న్యూస్ అందించే వెబ్సైట్లను న్యూస్ వెబ్సైట్ల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. వెబ్సైట్కు సంబంధించిన యజమాని వివరాలు, దేశం, నెటిజన్లను తప్పుదోవ పట్టించడం ఇలా ఏ చర్యకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందుకోసం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొంది. నెటిజన్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సౌకర్యవంతంగా చదువుకునేలా వార్తలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ తెలిపింది. 'మీకోసం మిమ్మల్ని మీరు తప్పుగా చూపించుకోవద్దు. వెబ్సైట్లు గూగుల్ న్యూస్తో సహా ఎవర్నీ తప్పుగా చూపించవద్దు. తప్పులు, యాజమాని వివరాలు గోప్యంగా ఉంచడం, నెటిజన్లను తప్పుదోవ పట్టించేలా చేయటం, ఒక దేశంలో ఉండి మరో దేశంలో ఉన్నట్లు కంప్యూటర్ ఐపీలను చూపించటం ఇక సహించం' అని గూగుల్ తెలిపింది.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్