నేటి మహాసభలకు హాజరుకానున్నతారలు వీరే

- December 17, 2017 , by Maagulf
నేటి మహాసభలకు హాజరుకానున్నతారలు వీరే

హైదరాబాద్: సోమవారం నాలుగోరోజు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. సాయంత్రం 6గంటలకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.

'మా' అధ్యక్షులు శివాజీరాజా, సినీ నటులు నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 6.30-7.00 గంటల వరకు మలేసియా తెలుగు సాంస్కృతిక కదంబ కార్యక్రమం జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com