ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం, 12 మంది సజీవదహనం

- December 17, 2017 , by Maagulf
ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం, 12 మంది సజీవదహనం

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఖైరానీ రోడ్డులోని ఓ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com