బ్యాడ్ వెదర్: దుబాయ్ సఫారీ మూసివేత
- December 17, 2017వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున దుబాయ్ సఫారీ పార్క్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం), వాతావరణ పరిస్థితుల్లో అప్పటికప్పుడు విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది గనుక, అప్రమత్తంగా ఉండాలని రెసిడెంట్స్కి సూచించింది. భారీ వర్ష పాతం పలు ప్రాంతాల్లో కురవనుందని ఎన్సిఎం హెచ్చరించింది. ఇప్పటికే దుబాయ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించాక, దుబాయ్ సఫారీ పార్క్ యధాతథంగా సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని దుబాయ్ మునిసిపాలిటీ ప్రకటించింది. సఫారీ పార్క్లో జంతువుల భద్రత నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. డిసెంబర్ 12న ప్రారంభమైన దుబాయ్ సఫారీ పార్క్లో వివిధ రకాలైన 2,500 జంతువులు ఉన్నాయి. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA