దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ ఆత్మహత్య
- January 12, 2018సంసార బంధాలనుంచి విముక్తి కోసం సన్యాసం స్వీకరిస్తే అక్కడ కూడా మనశ్శాంతి కరవాయే. ఏమి సేతుర లింగా అంటూ కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని హుళ్లత్తి గ్రామ దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ (38) ఆత్మహత్య చేసుకున్నారు. గదం జిల్లా శిరహట్టి తాలూకాలోని బాలేహోసూర్కి చెందిన దింగాలేశ్వర మఠంలో ఉండేవారు. ఆదివారం అర్థరాత్రి మఠంలో ఎవరూ లేని సమయం చూసి డెత్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నారు. మరుసటి ఉదయం మఠానికి వచ్చిన భక్తులు స్వామీజీ అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి డెత్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా మనశ్శాంతి లేదని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన దేహానికి మఠంలోనే అంత్యక్రియలు నిర్వహించాలనే కోరికను వెల్లడించారు స్వామీజీ సూసైడ్ నోట్లో.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన