బాలకృష్ణకు రూ. 25 లక్షల చెక్కును అందజేసిన సింధు

- January 12, 2018 , by Maagulf
బాలకృష్ణకు రూ. 25 లక్షల చెక్కును అందజేసిన సింధు

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి  ఒలింపిక్  విజేత   పీవీ సింధు   బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి  ఆర్థిక సాయం చేశారు  . ఈ   రోజు   ఉదయం  బసవతారకం  ఆస్పత్రి నిర్వాహుకుడు  సినీ నటుడు  బాలకృష్ణ కు    రూ. 25 లక్షల చెక్కును సింధు అందజేశారు.  బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోలో     గెలుచుకున్న  25 లక్షల చెక్కును    క్యాన్సర్ ఆస్పత్రికి  ఇచ్చినట్లు పీవీ సింధు తెలిపారు  సామిజిక బాధ్యతగా  క్యాన్సర్ రోగులకు తన వంతు సాయం చేయాలన్న  ఉద్దేశంతోనే   ఈ చెక్కును ఆస్పత్రి యజమాన్యానికి అందజేశానని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను బాలకృష్ణ సన్మానించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com