3లక్షల 50 ఏళ్ల నాటి ఏనుగు దంతం ఎడారిలో లభ్యం
- January 12, 2018రియాద్: ' ఏనుగమ్మ ..ఏనుగు.. మా వూరు వచ్చిందమ్మా ఏనుగుని పిల్లలు సంబరపడినమాదిరిగా సౌదీ వాసులు ఆనందపడుతున్నారు. కారణమేమిటంటే 3 లక్షల 50ఏళ్ల నాటి ఏనుగు దంతాలు ఎడారిలో కనుగొన్నారు. తైమా ప్రాంతంలోని ఒక ఎండిపోయిన ఒక ఒయాసిస్సులో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ అరుదైన అవశేషాలు లభ్యమయ్యాయి. ఏనుగు దంతాలతోపాటు మొసళ్లు ఇతర జంతువులకు సంబంధించిన అవశేషాలు సైతం ఇక్కడ కనిపించాయని సౌదీ అర్కియాలజిస్టు డాక్టర్. అలీ అల్ గాబ్బన్ చెప్పారు. ప్రస్తుతం ఎడారిలా కనిపిస్తున్న ప్రాంతం ఒకప్పుడు జంతువులు జీవించడానికి అనువైన ప్రాంతామని ఆయన తెలిపారు. తైమాలో దొరికిన అవశేషాలను పరిశీలిస్తే సౌదీ చరిత్ర ఈనాటిది కాదని తెలుస్తోందని అలీ చెప్పారు. పలు చోట్ల తవ్వకాలు జరిపితే మరింత స్పష్టత వస్తుందని పురాతత్వ శాస్త్రవేత్త అలీ వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా వార్తలు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం