3లక్షల 50 ఏళ్ల నాటి ఏనుగు దంతం ఎడారిలో లభ్యం

- January 12, 2018 , by Maagulf
3లక్షల 50 ఏళ్ల నాటి ఏనుగు దంతం ఎడారిలో లభ్యం

రియాద్: ' ఏనుగమ్మ ..ఏనుగు.. మా వూరు వచ్చిందమ్మా ఏనుగుని పిల్లలు సంబరపడినమాదిరిగా సౌదీ వాసులు ఆనందపడుతున్నారు. కారణమేమిటంటే 3  లక్షల 50ఏళ్ల నాటి ఏనుగు దంతాలు ఎడారిలో  కనుగొన్నారు. తైమా ప్రాంతంలోని ఒక ఎండిపోయిన ఒక ఒయాసిస్సులో  పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ అరుదైన అవశేషాలు లభ్యమయ్యాయి. ఏనుగు దంతాలతోపాటు మొసళ్లు ఇతర జంతువులకు సంబంధించిన అవశేషాలు సైతం ఇక్కడ  కనిపించాయని సౌదీ అర్కియాలజిస్టు డాక్టర్. అలీ అల్ గాబ్బన్ చెప్పారు. ప్రస్తుతం ఎడారిలా కనిపిస్తున్న ప్రాంతం ఒకప్పుడు జంతువులు జీవించడానికి అనువైన ప్రాంతామని ఆయన తెలిపారు. తైమాలో దొరికిన అవశేషాలను పరిశీలిస్తే  సౌదీ చరిత్ర ఈనాటిది కాదని తెలుస్తోందని అలీ చెప్పారు. పలు చోట్ల తవ్వకాలు జరిపితే మరింత స్పష్టత వస్తుందని పురాతత్వ శాస్త్రవేత్త  అలీ వ్యాఖ్యానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com