సరస్వతీ దేవికి తుది వీడ్కోలు:మెగాస్టార్
- February 03, 2018ప్రముఖ నటి, నట శిక్షకురాలు దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కనకాల (78) శనివారం హైదరాబాద్ లోని మణికొండలోని సొంత ఇంటిలో మరణించారు. ఆమె మరణం తీరని లోటు అని సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్ సిటీలో లేనందున ఆ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. తనకు నటనలో ఓనమాలు దిద్దించిన గురువు తో అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకొన్నారు. లక్ష్మీదేవి మృతి పట్ల చిరంజీవి సంతాపం ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పేరు లక్ష్మీదేవి అయినా నా పాలిట.. సరస్వతీ దేవి. ఆ రోజు ఆమె చెప్పిన పాఠాలే నా పాఠవాలకు మూలం... ఆమె నాకు నటనలో నేర్పిన మెలకులవలే నాలోని నటుడికి మెలకువలు.. ఈ రోజు నేను ఎంతో మందికి అభిమాన హీరో అయినందుకు ఎంత సంతోషపడతానో... లక్ష్మీదేవి గారి శిష్యుడిని అని చెప్పుకోవడానికి అంత గర్వపడతాను. అటువంటి నా గురువు ఈ రోజు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడం నాకు తీరని లోటు... తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతి నటుడుకి లక్ష్మీదేవి మరణం ఎంతో బాధకలిగించే వార్త... బరువైన క్షణాలు.. అలా బరువెక్కిన నా హృదయంతో నా చదువులమ్మకి కన్నీటి తో తుది వీడ్కోలు పల్కుతున్నా..అని చిరంజీవి చెప్పారు.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం