సినీ నటి పార్వతీఘోష్ కన్నుమూశారు
- February 12, 2018భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: సినీ సీనియర్ నటి, ఒడియా చలనచిత్ర రంగంలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన పార్వతీఘోష్(85) కన్నుమూశారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో భువనేశ్వర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె భౌతికకాయాన్ని భువనేశ్వర్లో ఉన్న నివాసానికి తరలించిన అనంతరం అభిమానులు, సినీ నటీనటులు చివరి దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఆమె భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు ఒడియా సినీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పార్వతీఘోష్ ఎంతో కృషిచేశారన్నారు. ఒక మహిళ తలచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపించారని కొనియాడారు. ఒడియా సినీ దర్శకురాలిగా తొలుత ఆమె గుర్తింపు సాధించారని, ఆమె ఆదర్శాలు అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. ఆమె కుమారుడు అమెరికా నుంచి వచ్చేక అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. 16 ఏళ్ల వయసులో పార్వతీఘోష్ సినీరంగంలో ప్రవేశించారు.
'శ్రీ జగన్నాథ్' పేరిట 1950లో నిర్మించిన చిత్రంతో ఆమె బాలనటిగా రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకుల హృదయాల్లో మంచిస్థానం సంపాదించుకున్నారు. 1933 మార్చి 28న కటక్లో ఆమె జన్మించారు. 'అమారి గావ్ జియో', 'భాయి, భాయి', 'మా లక్ష్మీ' వంటి సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు అర్పించారు.
పార్వతీఘోష్కు పలు అవార్డులు, సత్కారాలు అందాయి.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్