మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..!
- February 13, 2018ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. ఆదిదేవుడికి అర్చనలు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వరంగల్ లోని వేయి స్తంభాల దేవాలయం ,కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, కాళేశ్వరం ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తుల పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం పుణ్యక్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడి ఆలయంతో పాటు పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని పరమశివుడి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ