కీలక నిర్ణయం దిశగా కాంగ్రెస్..
- February 19, 2018మోడీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏపీకి విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో నిలదీయడానికి అవిశ్వాసమే సరైన మార్గమనుకొంటోంది కాంగ్రెస్. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం.. వైఎస్ జగన్ కూడా సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా దీనిపై చర్చించడం రాజకీయాల్లో హీట్ పెంచింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. మార్చి 5 నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో, ఆ లోపే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్