తెలంగాణలోని జీనోమ్‌ వ్యాలీ క్లస్టర్‌ ఆసియాలోనే అతిపెద్దది: మంత్రి కేటీఆర్‌

- February 22, 2018 , by Maagulf
తెలంగాణలోని జీనోమ్‌ వ్యాలీ క్లస్టర్‌ ఆసియాలోనే అతిపెద్దది: మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో సులభతర వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీనోమ్‌ వ్యాలీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో బయో ఏషియా సదస్సును కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సదస్సుకు 52 దేశాల నుంచి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చారు. రాష్ట్రంలోని జీనోమ్‌ వ్యాలీ క్లస్టర్‌ ఆసియాలోనే అతిపెద్దదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జీనోమ్‌ వ్యాలీకి ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రభుత్వం మరింత దృష్టి పెట్టిందన్న కేటీఆర్‌.. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com