ఈ నెల 29న 'ఇరుంబు తిరై' విడుదల సన్నాహాలు
- March 03, 2018విశాల్ హీరోగా సొంత బ్యానరు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న చిత్రం 'ఇరుంబు తిరై'. మిత్రన్ దర్శకత్వంలోని ఈ సినిమాలో సమంత కథానాయిక. అర్జున్ విలన్ పాత్ర పోషించారు. విశాల్ గురువు అర్జున్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. త్వరలో విడుదలకానున్న ఈ సినిమా వాణిజ్య పనులు ఊపందుకున్నాయి. కేరళ మార్కెట్కు సంబంధించిన హక్కులను శిబు తమీమ్ సొంతం చేసుకున్నారు. విజయ్ నటించిన 'పులి', విక్రం నటించిన 'ఇరుముగన్' చిత్రాలను గతంలో నిర్మించారు శిబు. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విక్రం నటిస్తున్న 'సామి స్క్వేర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశాల్కు కేరళలో మార్కెట్ బాగుంది. అందుకే మరింత గ్రాండ్గా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు తమిళంలో కూడా పంపిణీ పనులు ఆరంభమయ్యాయి. మార్చి 29వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు.a
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన