9న మార్చి'ఏం మంత్రం వేశావే' విడుదల కానుంది:శివ కుమార్
- March 03, 2018హైదరాబాద్:విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఏ మంత్రం వేశావే. శివానీ సింగ్ నాయికగా నటించింది. గోలీసోడా ఫిలింస్ పతాకంపై శ్రీధర్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మల్కాపురం శివకుమార్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఏ మంత్రం వేశావే చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ..నేడు ప్రపంచమంతా అరచేతిలోని ఫోన్లోకి వచ్చేసింది. ఇలాంటి సమయంలో యువత ఎక్కువగా ఆన్లైన్ గేమింగ్లకు అలవాటు పడుతున్నారు. వాస్తవంగా తమ చుట్టూ ఇంటిలో, సమాజంలో ఏం జరుగుతుందో ఆలోచించలేకపోతున్నారు. చివరకు అన్ని రకాలుగా భవిష్యత్నూ కోల్పోతున్నారు. ఇలాంటి ఓ యువకుడిని అతనికి పరిచయమైన యువతి ఎలా మార్చింది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత బాగా చూపించింది అనేది కథాంశం. మూస చిత్రాలకు భిన్నమైన నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. పిల్లలు పెద్దలకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.తెలుగులో అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తర్వాత ప్రేక్షకుల్లో స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్నారు. ఏ మంత్రం వేశావే పై అంచనాలు బాగా ఉన్నాయి. ఈ నెల 9న ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాం. అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దల అండతోనే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు దురాశకు పోతున్నారు. చిన్న నిర్మాతలకు నష్టాలు తీసుకొస్తున్నారు. అన్నారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు