దేశవ్యాప్తంగా 47 ఇండిగో విమానాలు రద్దు
- March 12, 2018ముంబై : పౌర విమాన శాఖ కఠిన నిర్ణయం తీసుకున్నది. దీంతో ఏ320నియోస్ విమానాలు గ్రౌండ్ అయ్యాయి. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లు ఉన్న విమానాలను నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అకస్మాత్తుగా నిర్ణయించింది. ఈ కారణంగా ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా 47 విమానాలను రద్దు చేసింది. గోఎయిర్కు సంబంధించిన మరో మూడు విమానాలను కూడా రద్దు చేశారు. 47 విమానాలను నిలిపేసినట్లు ఇండిగో ఇవాళ నత వెబ్సైట్లో పేర్కొన్నది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్, బెంగుళూర్, పాట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, గౌహతిల నుంచి ప్రారంభం అయ్యే విమానాలను రద్దు చేశారు. సోమవారం అకస్మాత్తుగా ఇండిగో విమానం ఒకటి గాల్లోనే తీవ్ర వడిదిడుకులకు లోనైంది. దీంతో డీజీసీఏ తక్షణం అలాంటి విమానాలను రద్దు చేయాలని ఆదేశించింది. ఇంజిన్ సమస్యలు ఉన్న ఏ320నియో ప్లేన్లను ఫిబ్రవరిలోనే గ్రౌండ్ చేశారు. విమానాలను ల్యాండ్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు. దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ ప్రతి రోజు సుమారు వెయ్యి సర్వీసులను నడుపుతున్నది.
తాజా వార్తలు
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు