దుబాయ్ మెట్రోలో మహిళపై మద్యం మత్తులో దాడి
- March 13, 2018దుబాయ్ మెట్రో రైలులో ఓ వ్యక్తి, ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు విచారణ జరుగుతోంది. 38 ఏళ్ళ ఇండియన్ ఒకరు, ఓ మహిళను అసభ్యకరంగా తాకాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 14న చోటు చేసుకుంది. సేల్స్మెన్గా పనిచేస్తున్న నిందితుడు మాత్రం, తన మీద వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నాడు. లైసెన్స్ లేకుండా ఆల్కహాల్ సేవించాడంటూ వచ్చిన ఆరోపణల్నీ ఆయన ఖండిస్తున్నాడు. మహిళను టచ్ చేసిన మాట వాస్తవమే అయినా, అది అనుకోకుండా జరిగిందని నిందితుడు చెప్పాడు. 27 ఏళ్ళ బాధితురాలు మాట్లాడుతూ రాత్రి 10.15 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందనీ, ఆ సమయంలో నిందితుడు తప్పతాగి వున్నాడనీ, తనను గట్టిగా పట్టుకున్నాడనీ పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ కేసులో తీర్పుని మార్చి 27న న్యాయస్థానం వెల్లడించనుంది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్