మలేషియాలో 'నిన్నే చూస్తు'

- March 21, 2018 , by Maagulf
మలేషియాలో 'నిన్నే చూస్తు'

నూతన నటీనటులు శ్రీకాంత్‌, నితిన్‌, హేమలత ప్రధాన తారాగణంలో రూపొందుతున్న చిత్రం నిన్నే చూస్తు. సుమన్‌, భానుచందర్‌, సుహాసిని ఇతర ముఖ్యపాత్రధారులు. కె.గోవర్థనరావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. హేమలతా రెడ్డి నిర్మాత. ఇటీవలే రెండు షెడ్యూల్స్‌ పూర్తిచేసుకుంది. తాజాగా మూడవ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల నిన్నే చూస్తు అనే పాటను మలేషియాలో చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ మా సినిమాకు టైటిల్‌ సాంగ్‌ ప్రత్యేకం. సంగీత దర్శకుడు రమణ్‌ రాథోడ్‌ మంచి బాణీలు అందించారు. మంచి కుటుంబకథతో తీస్తున్న సినిమా ఇది. సీనియర్‌ నటులు నటించడం ఆనందంగా ఉంది. త్వరలో షూటింగ్‌ పూర్తిచేస్తాం అన్నారు. 
ఈ చిత్రానికి సంగీతం రమణ్‌ రాథోడ్‌, ఛాయాగ్రహణం ప్రసాద్‌ ఈదర, మాటలు కరణ్‌ గోపిని, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కె.గోవర్థన్‌ రావు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com