షూటింగ్ పూర్తిచేసుకున్న 'మహానటి'

- March 21, 2018 , by Maagulf
షూటింగ్ పూర్తిచేసుకున్న 'మహానటి'

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. కీర్తి సురేశ్‌ సావిత్రిగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ చైతన్య అక్కినేని నాగేశ్వరరావుగా అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ బుధవారంతో పూర్తి కావటంతో చిత్ర బృందం సావిత్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ఫొటోను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసారు. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com