విమానంలో సీటు కింద 1.222 కేజీల బంగారం
- March 23, 2018శంషాబాద్:విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.222 కేజీల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. సదరు బంగారం సామగ్రిలో కాకుండా విమానంలోని నిందితుడి సీటు కింద లభ్యమైంది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొన్నారు.విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్కు వచ్చాడు. ఎయిర్పోర్టు బయటకు వస్తున్న క్రమంలో సదరు ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాస్పోర్టును పరిశీలించారు. అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో విచారించగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అంగీకరించాడు. విమానంలో సీటు కింద రహస్యంగా పెట్టిన 1.222కేజీల బంగారం బిస్కెట్లను మరోవ్యక్తి అదే విమానంలో అదే సీటును బుకింగ్ చేసుకొని దిల్లీ మీదుగా వైజాగ్కు తరలిస్తాడని వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు